ఆ వెబ్ సిరీస్ తో రీఎంట్రీకి సిద్దమవుతున్న హీరోయిన్..?
వెంకటేశ్, రానా కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్ర కోసం నిషా అగర్వాల్ను సంప్రదించారట. మంచి కథతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో కీలకపాత్రలో నటించే అవకాశం దక్కడంతో నిషాఅగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారట. అలాగే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఆమె యాక్టింగ్ ఫీల్డ్ లో రీఎంట్రీ ఇచ్చినట్లవుతుంది. కాజల్ అగర్వాల్ కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సినిమాలకంటే వెబ్ సిరీస్ లో ఎక్కువగా హిట్ అవుతున్నాయి. కరోనా కాలంలో ఎవరూ కూడా థియేటర్లకు వెళ్లడం లేదు. దీంతో మంచి కథాబలం ఉన్న వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వెబ్ సిరీస్ ల వల్ల మంచి నటీనటులకు కూడా పలు ఆఫర్ వస్తున్నాయి. తాజాగా నిషా అగర్వాల్ కి కూడా మంచి అవకాశం రావటంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారట.
ఇకపోతే 2013లో ముంబయికి చెందిన ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న నిషా అగర్వాల్ 2018 లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత కూడా ఆమె తన బొడ్డు అందాలు, ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ సెగలు పుట్టిస్తున్నారు. డిజిటల్ తెరపై ఆమె మళ్లీ నటించనున్నారని వార్తలు రావడంతో అభిమానులు బాగా ఎగ్జైట్ అవుతున్నారు.