టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పృథ్వీ రాజ్ స్టార్ కమెడియన్ గా అతి తక్కువగా కాలంలోనే ఎదిగారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా పృథ్వీ రాజ్... టాలీవుడ్ పరిశ్రమ లో దూసుకు పోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ... టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు పృథ్వీ రాజ్ . అయితే.. వరుస విజయాలతో దూసుకు పోతున్న పృథ్వీ రాజ్ ... కెరీర్ లోనూ కొన్ని ఆటు పోటులు కూడా ఎదురయ్యాయి. వరుస సినిమా లు చేసుకుంటూనే.. వైసీపీ పార్టీ తరఫున గతంలో ప్రచారం కూడా చేశారు పృథ్వీ రాజ్ . జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకునే వారిలో పృథ్వీ రాజ్ ముందుంటాడు.
ఈ నేపథ్యం లోనే ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధికారం రాగానే... పృథ్వీ రాజ్ కు అనూహ్యంగా ఎస్వీబీసీ చైర్మన్ పదవి వచ్చింది. ఇక కెరీర్ సెట్ అయింది అనుకునే లోపే.. ఓ ఆడియో టేపు..పృథ్వీ రాజ్ కెరీర్ ను మార్చేసింది. పృథ్వీ రాజ్ ఇప్పుడు మళ్లీ... సినిమాల బాట పట్టారు. అయితే.. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న... పృథ్వీ రాజ్... కత్తి మహేష్ మృతి ఘటన పై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో వైసీపీ పార్టీ కి.. కత్తి మహేష్ మరియు పృథ్వీ రాజ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తాజాగా కత్తి మహేష్ మృతి పై పృథ్వీ రాజ్ స్పందించారు.
కత్తి మహేష్ చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్న పృథ్వీ రాజ్ ... తన జీవితంలో అన్యాయంగా ఏమీ సంపాదించలేదని పేర్కొన్నారు. అలాంటి మంచి వ్యక్తి మృతి చెందాక... చాలా మంది కత్తి మహేష్ పై ట్రోలింగ్ చేయడం దారుణమని మండి పడ్డారు పృథ్వీ రాజ్. ఆయన చికిత్స నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన రూ. 17 లక్షల పై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు. మానవ దృక్పథం తో ప్రభుత్వం ఆ సహాయం చేసిందన్నారు. ఇక కత్తి మహేష్ మృతి పై పృథ్వీ రాజ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రైవర్ కు ఏమీ కాకుండా... ఒక కత్తి మహేష్ కే గాయాలు కావడంతో అందరికీ అనుమానాలు వస్తాయని అభిప్రాయ పడ్డారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు పృథ్వీ రాజ్.