ఏవండోయ్.. ఇది విన్నారా.. పూజ హెగ్డే ఇంటర్వెల్ కల్లా వచ్చేస్తుందట..?

praveen
మెగాస్టార్ చిరంజీవి సక్సస్ ఫుల్ దర్శకుడు  కొరటాల శివ కాంబినేషన్లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ప్రకటించిన నాటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.  కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నాడు అని చిత్రబృందం క్లారిటీ ఇవ్వడంతో ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి మొదటిసారి ఫుల్ లెంత్ పాత్రలో తండ్రి కొడుకులు ఇద్దరు ని చూసేందుకు సిద్ధమవుతున్నారు మెగా అభిమానులు.

 ఇక ఇప్పటికే ఆచార్య సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. అయితే ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్న రామ్చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ గురించి ఎన్నో వార్తలు గతంలో హల్చల్ చేయగా చివరికి పూజా హెగ్డే కన్ఫామ్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే పూజ హెగ్డే పాత్ర ఆచార్య సినిమాలో ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర టాక్ కొనసాగుతోంది.

 అయితే పూజా హెగ్డే ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దానిపై ఇటీవల టాలీవుడ్ లో ఒక వార్త వైరల్ గా మారిపోయి ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తోంది. ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఎంట్రీ సరిగ్గా ఇంటర్వెల్ సమయంలో ఉంటుందని రామ్చరణ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పే సమయంలో పూజా హెగ్డే ఎంట్రీ ఉంటుంది అని ఒక వార్త వైరల్ గా మారింది. అయితే ఇంటర్వెల్ సమయంలో పూజ హెగ్డే పాత్ర ఎంట్రీ వుంటుంది అంటే ఇక ఏదో ట్విస్ట్ ప్లాన్ చేసే ఉంటారు అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: