వామ్మో ... ఆచార్య కు అదే అతి పెద్ద మైనస్ కానుందా ..... ??

GVK Writings
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాం చరణ్ ల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆచార్య పై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. చరణ్ ఈ మూవీ లో సిద్ద అనే యువ విద్యార్థి నాయకుడిగా కన్పించనుండగా చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్ర చేస్తున్నట్లు టాక్. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి సూపర్ రెస్పన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటికె చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో దేవాలయాల భూముల కుంభకోణాల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు శివ తీస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని, అలానే ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి ఐ ఫస్ట్ అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో ఎంతో వైరల్ అవుతోంది.

అదేమిటంటే, ఈ మూవీ యొక్క రన్ టైం దాదాపుగా మూడు గంటల వరకు ఉంటుందని అంటున్నారు. ఇటీవల వస్తున్న సినిమాలు చాలావరకు రెండున్నర గంటల లోపే ఉంటున్నాయని, ఇటువంటి సమయంలో ఆచార్య మూవీ రన్ టైం మూడు గంటలు ఉండడం ఒకరకంగా ఆ మూవీ కి కొంత మైనస్ గా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈ వార్త పై అధికారికంగా ఇంకా న్యూస్ బయటకు రాలేదని, ఈ విషయాన్ని యూనిట్ దృవీకరించేవరకు దీనిని విశ్వసించలేమని అంటున్నారు పలువురు విశ్లేషకులు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: