నితిన్ రంగ్ దే సినిమా కి చెక్ పెట్టబోతున్నాడా..?

P.Nishanth Kumar
ఇష్క్ సినిమా తో మళ్ళీ కామ్ బ్యాక్ చేసిన నితిన్ ఆ తర్వాత వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని అయన చూస్తున్నారు..
గత కొన్ని రోజులుగా ఈ సినిమా సంక్రాంతి కి వస్తుందని చెప్తుండగా ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి రావట్లేదని తెలుస్తుంది.. మర్చి లో ఈ సినిమా ను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పేశారు. ఇక ఈ సినిమా తో పాటె చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా ని చేశాడు నితిన్. టాలీవుడ్ లో వెరైటీ చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. ఐతే సినిమా తో తొలి సినిమా తోనే వెరైటీ కాన్సెప్ట్ అందించిన ఈ దర్శకుడు గోపీచంద్ సాహసం సినిమా తో కమర్షియల్ దర్శకుడిగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.. ఆ తర్వాత మనమంతా సినిమా చేసి కుటుంబ కథ దర్శకుడిగా మారిపోయారు.. ఇక ప్రస్తుతం నితిన్ తో ఓ సినిమా ని అనౌన్స్ చేసి ఆ సినిమా పనుల్లో ఉండగా నితిన్ వరుస సినిమాల్లో బిజీ గా ఉన్నాడు.
అయితే నితిన్ రంగ్ డే కన్నా ముందే చెక్ సినిమా ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా చిన్న టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఆ టీజర్ కు అనూహ్య రెస్పాన్స్ దక్కింది. సినిమాపై అంచనాలు పీక్స్ కు తీసుకు వెళ్లింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా అయ్యి ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు. దాంతో చెక్ సినిమాను రంగ్ దే కంటే ముందే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: