గొంతు కోసుకున్న గెటప్ శీను.. కంట నీరు పెట్టుకున్న ఫ్యాన్స్.. స్టేజ్ అంతా రక్తమే..?
గెటప్ శీను చేసిన దానికి అభిమానులు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకీ గెటప్ శీను ఏం చేసాడు అని అంటారా.. ఇప్పటికే ఎంతో మంది రైతుల బాధలను తెలియజేస్తూ ఎన్నో రకాల పర్ఫామెన్స్ చేశారు.. ఈ పర్ఫామెన్స్ లు అన్నీ హృదయానికి హత్తుకునేలా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే సంక్రాంతి ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో ఈటీవీ విడుదల చేయగా ఈ ప్రోమో లో భాగంగా గెటప్ శీను రైతుల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. ఒక పర్ఫామెన్స్ చేస్తాడు.
ప్రోమోలో కేవలం కొన్ని సెకన్లపాటు గెటప్ శ్రీను చేసిన పర్ఫామెన్స్ చూస్తున్నంత సేపు అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. చివరికి రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తే దళారుల చేతిలో రైతులు మోసపోవడం చూపిస్తూ ఉంటే అందరి కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇక అందరికీ తెలియజేసేలా రైతులు ఉద్యమించాలి అంటూ రైతు బిగెటప్ లో ఉన్న గెటప్ శీను సహా మిగతా వారందరూ కొడవలితో గొంతు చూసుకుని చనిపోతారు దీంతో ఇది చూసిన అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. గెటప్ శీను గొంతు కోసుకున్న సమయంలో స్టేజ్ అంతా రక్తం పడినట్లుగా ఎఫెక్టివ్ గా ఉండడంతో ఈ పర్ఫామెన్స్ మరింతగా అందరినీ కన్నీళ్లు పెట్టించింది.