సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క శెట్టి

Suma Kallamadi
అనుష్క శెట్టి ఆర్ మాధవన్ హీరో హీరోయిన్ గా నటించిన నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయ్యింది. ఈ సినిమా నిర్మాతలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు కానీ అనుష్క శెట్టి మాత్రం తన అభిమానులను తీవ్ర నిరాశలో ముంచేసింది. అయితే స్క్రిప్ట్ విషయంలో నిర్మాత కోన వెంకట్ జోక్యం చేసుకున్నారని.. అందుకే సినిమా చాలా చెత్తగా తయారయిందని టాక్ వినపడుతోంది. అసలు అంజలి పాత్ర కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి అనుష్క శెట్టి పాత్రకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా కోనవెంకట్ చేశారని కూడా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలాగే ఆర్ మాధవన్ పాత్ర చాలా వీక్ గా ఉండటంతో సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో అనుష్క శెట్టి కూడా తన అభిమానులను నిరాశపరిచినందుకుగాను బాధపడ్డారు. ఇకపై తన అభిమానులకు మంచి సినిమాలను మాత్రమే ప్రసాదించాలని ఆమె దృఢంగా నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.

అనుష్క శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అన్ని రకాల సినిమాల్లో నటించాను. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించాడు. ఇప్పుడు ఇంకాస్త ఇంటరెస్టింగ్ సినిమాల్లో నటించి నా అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా స్క్రిప్ట్ ఎంపికలో అస్సలు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని నిశ్చయించుకున్నాను. వెంటవెంటనే ఎక్కువ సినిమాలు తెరకెక్కించాలన్న ఆలోచన కూడా లేదు. హీరోయిన్ గా నేను చాలా నేర్చుకున్నాను..’ అని వెల్లడించారు.

‘ఎప్పుడూ సినిమా కథ, అందులో నా రోల్ గురించే మొదటిగా ఆలోచిస్తాను. మూవీలో కథానాయకుడు ఎవరు.? అని తెలుసుకొని ఆ తరువాత సినిమాల్ని ఒప్పుకోవడం, మానేయడం వంటివి ఎప్పుడూ నేను చేయలేదు, చేయడానికి కూడా ఇష్టపడను..’ అని అనుష్క శెట్టి ఓ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ చెప్పుకొచ్చారు. ‘నిశ్శబ్దం’ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ పై విడుదలవడం అనేది ఓ కొత్త అనుభూతి అని అభివర్ణించిన అనుష్క శెట్టి... సినిమా థియేటర్లలో ప్రేక్షకులు నిశ్శబ్దం సినిమాని చూసి వుంటే, ఇంకా మంచి అనుభూతి పొందేవారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: