విజయ్ దేవరకొండ మొదలు పెట్టాడు.. నాని అండగా నిలబడుతున్నాడు..

Deekshitha Reddy
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమధ్య వరుస ఫ్లాపులతో విలవిల్లాడాడు. అలాంటి టైమ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ తో ఒక్కసారిగా షాహిద్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్.. షాహిద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగులో అర్జున్ రెడ్డి తీసిన సందీప్ కుమార్ వంగా ఈ సినిమాని హిందీలో కూడా తీశాడు. కట్ చేస్తే.. షాహిద్ కపూర్ తెలుగు రీమేక్ లపై మనసు పడ్డాడు. నాని హీరోగా నటించిన జెర్సీని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తీస్తున్నారు. తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్నసూరి.. ఈ సినిమాను హిందీలో తీస్తున్నాడు.

జెర్సీ హిందీ రీమేక్ లో చెప్పుకోదగ్గ విశేషాలున్నాయి. ఈ సినిమా కోసం షాహిద్‌ 35 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకోబోతున్నారట. అంతేకాదు సినిమాకు వచ్చే లాభంలో 20 శాతం వాటా కూడా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన పారితోషికం పెంచినట్లు సమాచారం. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ గతేడాది డిసెంబరులో మొదలైంది. లాక్ డౌన్ తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు.

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాని రూ.60 కోట్ల బడ్జెట్‌తో తీశారు. ఆ సినిమా రూ.379 కోట్లు రాబట్టింది. అంతేకాదు షాహిద్‌, కియారా నటనకు సినీ ప్రముఖులతోపాటు నెటిజన్ల ప్రశంసలు లభించాయి. తెలుగు ‘జెర్సీ’లో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించారు. ఇందులో నేచురల్‌ స్టార్‌ క్రికెటర్‌ పాత్రలో కనిపించి అలరించారు. మరి హిందీ రీమేక్‌ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోనుందో చూడాలి. షాహిద్ కపూర్ కి తెలుగు రీమేక్ లు విజయ్ దేవరకొండ అలవాటు చేస్తే హీరో నాని దాన్ని కొనసాగిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: