రేప్‌ చేయబోయాడు.. మోడీజీ న్యాయం చేయండి..?

Chakravarthi Kalyan
మీటూ.. సినీ పరిశ్రమలో అమ్మాయిలకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై మొదలైన ఉద్యమం ఇది.  చాలా ఏళ్ల క్రితమే మొదలైనా.. దీని ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో హీరోయిన్ ఓ డైరెక్టర్ నన్ను వేధించాడంటూ ఏకంగా ప్రధాని కార్యాలయానికే మొర పెట్టుకుంది. అందులోనూ ఆమె ఆరోపించింది ఓ ప్రముఖ డైరెక్టర్ గురించి.. దీంతో ఇదో సంచలనంగా మారింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. పాయల్ ఘోష్. ఆమెతో  దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అసభ్యంగా ప్రవర్తించాడట. ఓసారి  మాట్లాడాలని.. రా అంటూ అనురాగ్‌ ఇంటికి పిలిచాడట. పెద్ద డైరెక్టర్ పిలిచాడు కదా ఏమైనా సినిమా ఛాన్స్ గురించి చెబుతారేమోని పాయల్ ఆశగా వెళ్లిందట. వెళ్లే సరికి అనురాగ్  బాగా తాగి ఉన్నారట. పాయల్ ను ఓ గదిలోకి తీసుకువెళ్లి.. బట్టలువిప్పి రేప్ చేసేందుకు ప్రయత్నించాడట. పాయల్ తీవ్రంగా ప్రతిఘటించిందట. తాను అలాంటిదాన్ని కాదని మొత్తుకుందట.

అయితే అప్పుడు అనురాగ్ ఏమన్నాడో తెలుసా.. ఇక్కడ ఇదంతా కామన్.. నేను ఫోన్‌ చేస్తే రిచా చద్దా, హ్యుమా ఖురేషి, మహిగిల్‌ లాంటి పెద్ద హీరోయిన్లే వచ్చి నాతో ఎంజాయ్ చేస్తారని చెప్పాడట. మరి ఇదంతా ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు బయటపెట్టిందంటారా.. దానికీ కారణం ఉంది. మీటూ’ ఉద్యమం సమయంలోనే అనురాగ్‌ కశ్యప్‌ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందట. అయితే.. ప్రముఖ డైరెక్టర్ పై అలా పోస్టు పెడితే ఇక ఛాన్సులు రావని కొందరు చెప్పడంతో ఆ పోస్టు తీసేసిందట.

మరి ఇప్పుడెందుకు చెబుతుందంటారా.. ఇటీవల అనురాగ్‌ తనను వాట్సాప్‌లో బ్లాక్‌ చేశాడు. చాలా బాధ అనిపించిందట అందుకే ఈ విషయం బయటపెట్టిందట. అంతే కాదు.. తనకు ప్రాణహాని ఉందంటున్న పాయల్ పీఎంవోని ట్యాగ్‌ చేసింది. నరేంద్ర మోదీ జీ.. దయచేసి నాకు సాయం చేయండి. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోండి అంటూ పోస్టు చేసింది. మరి దీనిపై పీఎంఓ స్పందిస్తుందా.. చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: