సుశాంత్ సోదరి లెస్బియన్.. నా ఒళ్లంతా తడిమింది.. రియా షాకింగ్‌ కామెంట్స్..!?

Chakravarthi Kalyan
సుశాంత్ సింగ్ సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. తనకూ సుశాంత్ సింగ్ కుటుంబానికి ఉన్న గొడవల గురించి ఆమె ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. సుశాంత్ సోదరి ఓ లెస్బియన్ అని.. ఓ రోజు తనతో చాలా అసభ్యంగా  ప్రవర్తించిందని చెప్పడం సంచలనం రేకిత్తిస్తోంది.

మొత్తం సుశాంత్ సింగ్ కుటుంబంపైనే రియా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తాను మహారాష్ట్ర గృహిణికి, భారత సైన్యంలో సర్జన్‌గా పనిచేసిన వ్యక్తికి జన్మించిన కుమార్తెను అంటూ చెప్పుకున్న రియా.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అర్థరహితమన్నారు. అసలు తనకూ సుశాంత్ కుటుంబానికి వచ్చిన పొరపొచ్చాల గురించి వివరించారు. గతేడాది ఏప్రిల్‌లో సుశాంత్‌ కుటుంబ సభ్యుల్లోని అవలక్షణాలు తాను గుర్తించానంటున్నారు.

ప్రత్యేకించి సుశాంత్ సోదరికి, తనకూ ఓ రోజు జరిగిన రహస్యాన్ని ఆమె వివరించారు. రియా చెబుతున్న ప్రకారం.. ఒకరోజు రాత్రి తాను సుశాంత్‌ ప్లాట్‌లో ఉన్న సమయంలో ఆయన సోదరి పూటుగా మద్యం సేవించి తన పడకగదిలోకి వచ్చిందట. తర్వాత అసభ్యంగా తన ఒళ్లంతా తడిమిందట. ఓ లెస్బియన్ మాదిరిగా ప్రవర్తించిందట. సుశాంత్ సోదరి ప్రవర్తనతో రియా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైందట.

ఆ తర్వాత సుశాంత్‌ సోదరిని గది నుంచి వెళ్లిపోవాలని రియా నిలదీసిందట. ఆ తర్వాత ఈ విషయాన్ని రియా సుశాంత్‌తో షేర్ చేసుకుందట. ఇది ఏమాత్రం నచ్చని సుశాంత్‌ సోదరితో గొడవకు దిగాడట. అలా సుశాంత్‌ కుటుంబానికి, తనకు మధ్య విభేదాలు మొదలయ్యాయని చెబుతోంది రియా. మరి రియా చెబుతున్న దాంట్లో నిజమెంత.. అదే నిజమైతే.. ఈ కుటుంబ వ్యవహారం సుశాంత్‌ను కుంగదీసిందా.. అదే ఆత్మహత్యకు దారి తీసిందా.. ఏమో ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగింది కదా. చూద్దాం ఏం తేలుస్తుందో..?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: