తన పెళ్లి ప్లానింగ్ మార్చిన రానా..... కారణాలివే....

VAMSI
మొన్నటి వరకు మోస్ట్ బ్యాచిలర్ లిస్టులో ఉన్న దగ్గుపాటి రానా ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి విధితమే. లాక్ డౌన్ కారణంగా తన ఎంగేజ్మెంట్ ను కొద్దిపాటి అతిథుల ముందే జరుపుకున్నారు రానా.అయితే భల్లాలదేవుడు కళ్యాణ మహోత్సవాన్ని  మాత్రం రాజమౌళి డైరెక్షన్ రేంజ్లో ఓ ప్రభంజనంలా జరుగుతుందని ఊహించుకుంటున్నారు అభిమానులు.కానీ ... దగ్గుపాటి రానా మాత్రం నా పెళ్ళికి కూడా షరతులు వర్తిస్తాయి అంటున్నాడట..

అసలు విషయానికొస్తే మహమ్మారి కరోనా కారణంగా ఈ మధ్య పెళ్లిళ్లు పరిమిత బంధుమిత్రుల మధ్యనే జరుగుతున్నాయి. అందరితో పాటే మేము అంటున్నారు దగ్గుబాటి కుటుంబీకులు. కేవలం 30 మంది ప్రముఖ అతిథుల మధ్యనే  రానా, మిహికల పెళ్లి వేడుక జరగనుందని క్లారిటీ ఇచ్చారు దగ్గుపాటి సురేష్.శుక్రవారం పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం శనివారం  బంధుమిత్రుల సమక్షంలో మా రానా పెళ్లి అంటూ తన సంతోషాన్ని షేర్ చేశారు దగ్గుబాటి సురేష్.

ఈరోజు సాయంత్రం 8 గంటల 45 నిమిషాలకు పరిమిత ఆప్తులు మరియు అతిరధుల సమక్షంలో  మధ్య రానా వివాహం జరగనుంది ఈ కళ్యాణ మహోత్సవం రామానాయుడు స్టూడియో లో అంగరంగ వైభవంగా జరగనుంది ఇప్పటికే స్టూడియో ఈ మొత్తం శానిటైజ్ చేసి వివాహానికి హాజరయ్యే ప్రముఖులకు ఆరోగ్య దృశ్యం కరోనా కట్టడికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. కరోనా కారణంగా పెళ్లికి హాజరు కాలేని ప్రముఖులకు ఇంటి దగ్గర నుండే వివాహ వేడుకను చూసేలా కంప్యూటర్ కిట్లను అందచేసి లైవ్ చేసేలాగా ... ఇక పెళ్ళికొడుకు హంగులతో ఆనంద సంబరాల మధ్య ఓ రేంజ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు మన లీడర్ రానా. ఇంతకీ మన భల్లాలదేవుడి పెళ్లి ఏ విధముగా జరగనుందో తెలిలంటా మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.ఈ అరుదైన వివాహానికి ఏ విధమైన ఏర్పాట్లు మరియు ఎంతమంది హాజరవుతున్నారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: