సెలబ్రెటీస్ ను సంక్షోభంలోకి నెట్టిన సుశాంత్ ఆత్మహత్య.. !

NAGARJUNA NAKKA

నెటిజన్లకు కోపం వస్తే.. ఉతికి ఆరేస్తాడు. ఇంకా ఎక్కువ కోపం వస్తే బూతులు తిడతారు. ఇక పట్టలేనంత కోపం వస్తే ఏం చేస్తారు..? అన్ ఫాలో అవుతారు. బాలీవుడ్ సెలబ్రెటీస్ ప్రస్తుతం అన్ ఫాలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దీనంతటికీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యే కారణం. 

 

ఎంతో ఫ్యూచర్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చలేదు. సుశాంత్ అభిమాని కాని వారు కూడా.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారసత్వ కుళ్లు రాజకీయాల వల్లే సుశాంత్ చనిపోయాడనీ.. కంగన.. వివేక్ ఒబేరాయ్.. శేఖర్ కపూర్ లాంటి సెలబ్రిటీస్ బహిరంగంగా విమర్శించడంతో నెటిజన్లు కూడా స్పందించారు. బాలీవుడ్ బంధుప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సెలబ్రెటీస్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఒక్కొక్కరుగా అన్ ఫాలో అవుతున్నారు. 

 

సుశాంత్ ఆత్మహత్య సెగ అలియాభట్ పై భారీగా పడింది. రాబ్తా మూవీలో సుశాంత్ పక్కన అలియా హీరోయిన్. చివరిలో డేట్స్ లేవని తప్పుకోవడంతో కృతిసనన్ ను తీసుకున్నారు. కరణ్ జోహార్ షోలో ముగ్గురు హీరోలకు రేటింగ్ ఇవ్వమంటే.. సుశాంత్ ఎవరు అని అలియా అడగడం.. ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. ఆ కోపాన్ని ఇప్పుడు చూపిస్తూ.. అలియాఇన్ స్టా నుంచి దాదాపు 5 లక్షల మంది అన్ ఫాలో అయి.. షాక్ ఇచ్చారు. 

 

రాబ్తా హిట్ తర్వాత సుశాంత్ ఏడు ఆఫర్స్ అందుకున్నాడు. ఆరు నెలల వ్యవధిలో ఇవి ఒక్కొక్కటిగా చేజారాయి. దీని వెనుక కరణ్ జోహార్ హస్తం ఉందన్న విమర్శలు సుశాంత్ చనిపోయాక వినిపించాయి. తన బేనర్ ధర్మ ప్రొడక్షన్స్ లో చేస్తున్నప్పుడు మరో సినిమా ఒకే చేయకూడదని.. సుశాంత్ కు ఇచ్చిన ఆఫర్ కరణ్ వెనక్కి తీసేసుకున్నాడట. ఇలా విమర్శలు ఎదుర్కొంటున్న కరణ్ అకౌంట్ నుంచి దాదాపు 2లక్షల మంది ఫాలోవర్స్.. అన్ ఫాలో అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: