నేను నానా కష్టాలు పడితే 23 ఏళ్ళు పట్టింది......కానీ తను మాత్రం 3 ఏళ్లలోనే ఆ ఛాన్స్ కొట్టేసిందిగా...!!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కె రాఘవేంద్ర రావుదర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించిన ఆర్య ,ఆపై బన్నీ, పరుగు, వేదం, జులాయి, రేసుగుర్రం, ఎవడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలవైకుంఠపురములో సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన బన్నీ, ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీతో కలిసి సరదాగా దిగిన ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ తో, అలానే ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయం ఏంటంటే, నిన్న నిఖిల్ సిద్దార్థ్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గతంలో కుమారి 21ఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించిన పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ప్రారంభోత్సవం జరిగింది.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాని అరవింద్ సమర్పిస్తుండగా, బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో నిర్మాత అల్లు అరవింద్ దంపతుల చేతుల మీదగా ఎంతో వైభవంగా జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అయిన అల్లు అర్హ, తన చేతుల మీదుగా ఈ సినిమాకు క్లాప్ కొట్టడం జరిగింది.
ఇక ఈ విషయాన్ని నిఖిల్ వీడియో తీసి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేయగా, నిఖిల్ పోస్ట్ చేసిన ఆ వీడియోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా రీట్వీట్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాక, తన కూతురు పై సరదాగా ఒక కామెంట్ కూడా చేశారు. ఒక సినిమాకు క్లాప్ కొట్టడానికి ఎన్నో కష్టాలు పడితే నాకు 23 ఏళ్లు పట్టింది. కానీ నా కూతురు అర్హ కేవలం మూడేళ్లలోనే ఆ ఘనత సాధించింది అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీ లను పోస్ట్ చేశారు అర్జున్. కాగా అల్లుఅర్జున్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవతోంది .....!!
All the Best for the new movie @actor_Nikhil . N Arha is lucky to be the chief guest at this age ... it’s took me 23 years of age to be chief guest at a muhurtam 😂 https://t.co/YUzxSU8DQe — allu arjun (@alluarjun) March 5, 2020