మెగా డాటర్ కొత్త బిజినెస్... వర్క్ అవుట్ అవుద్దా!
ఇప్పటికే డిజైనర్గా మంచి పేరును సంపాదించిన సుష్మిత తాజాగా మరో రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉందట. త్వరలో తాను సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్లకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్లోకి సుష్మిత కూడా అడుగుపెట్టనుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే దీనికోసం కాస్త భారీగానే ప్లాన్ చేస్తుందట. ముందుగా చిన్న చిన్న వెబ్ సిరీస్ తో మొదలు పెట్టి ఆ తరువాత సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఆల్రెడీ పని కూడా మొదలుపెట్టేసిందట. దానికి సంబంధించిన కథలు వింటూ. అందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే సుష్మిత బ్యానర్ ఎప్పుడు లాంచ్ చేస్తుందన్న విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన నిర్మాతల గురించి చూసుకుంటే మెగాస్టార్ వారసుడిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఘనవిజయం సాధించాడు. తండ్రి రీ ఎంట్రీ సినిమా కోసం నిర్మాతగా మారిన చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ను స్థాపించాడు. ఆ బ్యానర్లో తొలి సినిమాగా ఖైదీ నంబర్ 150 సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. తరువాత రెండో సినిమాగా సైరా నరసింహారెడ్డిలాంటి భారీ ప్రాజెక్ట్ను రూపొందించాడు ఈ సినిమా కమర్షియల్గా నిరాశపరిచినా నిర్మాతగా చరణ్కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇక నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయినా వెబ్ సిరీస్లతో ఆకట్టుకుంటుంది. తానే స్వయంగా నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కించిన వెబ్ సిరీస్లు మంచి విజయం సాధించాయి. ఇక మరి సుస్మిత ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.