బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాత రాజమౌళి ఒక సంవత్సరం విరామం తీసుకున్నారు. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో టాలీవుడ్ పేరు ప్రతిష్టలు పెంచిన రాజమౌళి ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రామ రావణ రాజ్యం అనే టైటిల్ని చిత్రానికి పరిశీలిస్తున్నారని టాక్స్ వినిపిస్తుండగా, ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజమౌళి.
ఈ మద్య ఓ ఫోటో లీక్ కావడం పై చాలా సీరియస్ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేదానిపై ఇంకా సందిగ్ధత నడుస్తూనే ఉంది. ఆ మద్య కీర్తి సురేష్ పేరు వినిపించినా దానిపై క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా సినిమాలో అలియా భట్ , పరిణితి చోప్రా అనే ఇద్దరు బాలీవుడ్ భామలు కథానాయికలుగా నటిస్తున్నారనే వార్త దావానంలా పాకింది.
ప్రస్తుతం రాజమౌళి మూవీస్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో ఆయన బాలీవుడ్ తారలకు ఎక్కువ ప్రాదాన్యత ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాదు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఏమైన స్పందిస్తుందేమో చూడాలి. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు రూ.300 భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు సమాచారం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.