దర్శకనిర్మాతలపై నటి ప్రియమణి ఫిర్యాదు..!

Edari Rama Krishna
త‌మిళంలో అంగుళీక మూవీని రూపొందించారు.. ఈ మూవీని అదే పేరుతో తెలుగులో విడుద‌ల చేయనున్న‌ట్లు ఆ చిత్ర నిర్మాత‌లు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. తాజాగా ఈ చిత్ర దర్శకనిర్మాతలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కి ఫిర్యాదు చేశారు నటి ప్రియమణి.  సినిమా ప్రచారం కోసం వారు తన ఫొటోలను వాడుకున్నారని, అందువల్ల వారు తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది.

ఈ సినిమా షూటింగ్ ఐదేళ్ల కిందటే ప్రారంభమయింది. అయితే ఇటీవలే పూర్తయింది. “ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటింటేందుకు తొలుత ప్రియ‌మ‌ణి సంత‌కం చేసింది.. అయితే కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత దర్శకనిర్మాతలు వేరే హీరోయిన్‌తో సినిమాను పూర్తి చేశారు.

తాను న‌టించ‌ని చిత్రంలో త‌న ఫోటోలు వాడుకున్నందుకు ప్రియ‌మ‌ణి సిరియస్ అయ్యారు.  ఎట్టి పరిస్థితుల్లో వారు తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ప్రియమణి ఫిర్యాదును ‘మా’ కార్యాలయానికి అందజేశానని ఆమె మేనేజర్ జి.హరినాథ్ తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: