పకడ్బందీ ప్లాన్ తో మహేష్ 25.. అందుకే బాలీవుడ్ నుండి అతన్ని దించుతున్నారు..!

shami
సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు హీరోయిన్ గా పూజా హెగ్దె ని ఫైనల్ చేశారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ క్రేజీ టెక్నిషియల్ మోహనన్ ను ఎంచుకున్నారట.


మహేష్ సినిమాకు బాలీవుడ్ క్రేజీ సినిమా సినిమాటోగ్రాఫర్ మోహనన్ ను సెలెక్ట్ చేశారట. షారుఖ్, ఆమీర్ లాంటి క్రేజీ హీరోల సినిమాలకు కెమెరామన్ గా పనిచేసి సత్తా చాటిన మోహనన్ మహేష్ 25వ సినిమాకు పనిచేస్తున్నాడు. సినిమా పకడ్బందీ ప్లాన్ లో భాగంగానే అతన్ని తీసుకున్నారని తెలుస్తుంది.


ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ఇయర్ దీవాళికి ఈ సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ కొరటాల శివతో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 20న భరత్ అనే నేను సినిమా రిలీజ్ అవుతుంది. 


బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల ఫ్లాప్ తో కాస్త సంక్షోభంలో పడిన మహేష్ ఇక నుండి సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. భరత్ తో పాటుగా రాబోతున్న మహేష్ 25వ సినిమా కూడా క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో మహేష్ తన స్టామినా ఏంటో మరోసారి చూపిస్తాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: