ఆయన గురించి తప్పుడు వార్తలు రాస్తే..జాగ్రత్త : అమలాపాల్

Edari Rama Krishna
మాలీవుడ్ హాట్ బ్యూటీ అమలాపాల్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ మద్య భర్తతో విడాకులు, కారు రిజిస్ట్రేషన్, లైంగిక వేధింపులు గురైన వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.  అమలాపాల్‌ ఇటీవల డాన్స్‌ శిక్షణ కోసం టీ.నగర్‌లోని ఒక స్కూల్‌కు వెళ్లింది. అక్కడ అళగేశన్‌ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని మాంబళం పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.అమలాపాల్ ఫిర్యాదుతో అళగేషన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా.. మేనేజర్ ప్రదీప్ కుమార్ సహకారంతోనే అమలాపాల్‌ను కలిశానని వెల్లడించాడు. అయితే అళగేషన్ ఎవరో తనకు తెలియదని ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమలాపాల్ తన మేనేజర్  ప్రదీప్‌కు బాసటగా నిలిచింది.

తన మేనేజర్ గురించి మీడియా సంస్థలు కొన్ని తప్పుగా రాస్తున్నాయని, ఇలా చేస్తే కోర్టులో కేసు కూడా వేస్తానని హెచ్చరించారు. కేసు విచారణలో ఉన్నందున తాను మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.కొన్ని మీడియా సంస్థలు తన మేనేజర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని, సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: