మనీ:SSY పథకం వల్ల.. 69 లక్షలు రాబడి..!!

Divya
కేంద్ర ప్రభుత్వం 2015 వ సంవత్సరంలో.. సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రారంభించారు.. ఈ పథకం మెచ్యూరిటీ పైన వచ్చే వడ్డీతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా భరోసాని ఇస్తుంది..SSY లో పెట్టుబడి చట్టంలోని సెక్షన్ 80C కిందికి వస్తుందట. దీనివల్ల పన్ను మిరహాయింపు కూడా ఉంటుంది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నాలుగు సార్లు చిన్న మొత్తంలో ఈ పొదుపు వడ్డీలను కూడా కట్టుకోవచ్చు.. అలాగే పథకాల వడ్డీ రేట్లు కూడా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం SSY వడ్డీ రేటును 8.2 శాతంగా ప్రకటించారు.

అయితే ఈ వడ్డీ రేటు ప్రతి త్రైమాసికంలో మారవచ్చు. అని మెచ్యూరిటీ సమయంలో దాదాపుగా 8 శాతం  నికర రాబడిన సైతం పొందవచ్చు. అందుచేతనే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా SSY పథకానికి ప్రతినెల రూ.12,500 లేదా ఏడాదికి 1.50 లక్షలు పెట్టుబడి ప్రారంభిస్తే అమ్మాయికి 21ఏళ్లు వచ్చే సమయానికి 69 లక్షల రూపాయలు వస్తుంది.. ఎవరైనా పెట్టుబడిదారుడు తమ ఆడపిల్ల పుట్టిన వెంటనే ఈ ఖాతాలో పెట్టుబడి మొదలుపెడితే.. 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.. 14 సంవత్సరాలు వయసు వచ్చేసరికి కనీసం ఒక్కసారైనా ఈ ఖాతాలో డిపాజిట్ చేస్తే.. 18 ఏళ్లు వచ్చే సమయానికి 50 శాతం వరకు విత్ డ్రాచేసుకోవచ్చు..

అయితే అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ ఖాతా నుంచి విత్డ్రా చేసుకోవడానికి ఇష్టం లేకపోతే అమ్మాయికి 20 ఏళ్లు వచ్చేసరికి పూర్తి విత్ డ్రాతో మొత్తం తీసుకోవచ్చు.. ఏడాదిలోపు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే ఇందులో ఆదాయపన్ను కూడా పొందవచ్చు.. దాదాపుగా 14 ఏళ్లపాటు ఇలా డబ్బులను కడితే మిగిలిన 5 ఏళ్ళు వదిలిపెడితే.. అమ్మాయికి 21 ఏళ్ళు వచ్చేసరికి పూర్తిగా ఉపసంహరించుకుంటే దాదాపుగా 69,32,648 కోట్ల రూపాయలు వస్తుంది.. ఈ పథకం ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: