Money: పీఎం కిసాన్ 15 వ విడత వచ్చేది అప్పుడే..!!

Divya
ఎంతోమంది రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద కొంత నగదును ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం ఈసారి పిఎం కిసాన్ యోజన పథకం కింద 15వ విడత దీపావళి లోపే రైతుల ఖాతాలో జమ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. నవంబర్ 12వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం నగదు విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. 14వ విడుద డబ్బులు ఈ ఏడాది జులై నెలలో విడుదల చేయడం జరిగింది.ఈ పథకం ద్వారా లబ్ధిదారులైన రైతులు సహాయాన్ని పొందుతారు. అయితే ఈసారి రావాలి అంటే కచ్చితంగా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని అధికారులు తెలుపుతున్నారు.


ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అనేది కేవలం రైతులకు ఆర్థిక సహాయంగా అందించడం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకాన్ని 2019 నుంచి ఉత్తరప్రదేశ్లో గోరఖ్ పూర్ లో ప్రారంభించగా.. రైతులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున మూడు విడుదలుగా ఏడాదికి 6000 ఆర్థిక సహాయాన్ని అందిస్తారు ఈ సొమ్ము నేరుగా రైతుల ఖాతాలోకి జమ అవుతుందట.


ఈకేవైసీకి ఎలా అప్లై చేయాలి అంటే..
1).ముందుగా మనం అధికారికంగా వెబ్సైట్..pmkisan.nic.in వెబ్సైట్ ని సంప్రదించాలి..

2). ఫార్మర్ కార్నర్ విభాగంలో ఈ కేసి పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.

3). ఓటిపి ఆధారంగా ఈ కేవైసీ ని పొందిన తర్వాత మనం ఆధార్ కార్డు నెంబర్ ని నమోదు చేయవలసి ఉంటుంది.


4). ఆ వెంటనే అక్కడ ఉన్న సెర్చింగ్ బటన్ పైన క్లిక్ చేయాలి.. ఆ వెంటనే మీ ఆధార్ కార్డు కి లింక్ అయిన నెంబర్ ని నమోదు చేసి ఓటీపి పొందడం పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.


5). ఆ తర్వాత ఓటిపిని నమోదు చేసి ధృవీకరిస్తే ఈ కేవైసీ పూర్తి అవుతుంది.


ఎవరికైనా తెలియకపోతే దగ్గరలో ఉండే రైతు భరోసాలోనైనా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: