మనీ: రూ.5 వేల పెట్టుబడితో రూ.16 లక్షలు మీ సొంతం..!

Divya
ఉద్యోగం లో ఉండి డబ్బు సంపాదిస్తున్నప్పుడే భవిష్యత్తు తరాల కోసం డబ్బు దాచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది వివిధ రకాల పొదుపు పథకాలపై దృష్టి పెడుతుంటారు. కానీ చిన్న వయసులోనే కొత్త ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టినా.. పెట్టుబడికి సరైన ప్లాట్ఫామ్ దొరకక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ అక్కడ నష్టాలు తప్పవు . కానీ బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటప్పడు చాలామంది పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడి పెట్టి సంతృప్తి చెందడం లేదు. ఈ పెట్టుబడిదారులకు సరైన పెట్టుబడి పథకం ఏదైనా ఉంది అంటే అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం మాత్రమే అని చెప్పాలి.

ఇందులో పొదుపు చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు.  పైగా మంచి రాబడి కూడా లభిస్తుంది. ఈ పథకం ఈఈఈ క్యాటగిరి కిందకి వస్తుంది.  మెచ్యూరిటీ విలువ వ్యవధి తర్వాత అందుకున్న మొత్తం పై పన్ను కూడా మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాను పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఎక్కడైనా సరే తెరవచ్చు. ఇందులో ఏడాదిలో కనీసం రూ. 500 కనిష్టంగా,  గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రభుత్వం ఈ పథకం పై 7.1% వడ్డీ అందిస్తోంది.  ఇది ఏదైనా బ్యాంకు ఫిక్స్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ మొత్తం కంటే చాలా ఎక్కువ అని చెప్పాలి.
ముఖ్యంగా ఎక్కువ  రేటు తో వడ్డీని చెల్లిస్తుంది మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే ఇందులో మీకు ఎక్కువ డబ్బు తిరిగి వస్తుంది. ఉదాహరణకు మీరు ప్రతి నెల 5000 రూపాయలను పెట్టుబడిగా పెడితే ఏడాదికి రూ.60 వేల చొప్పున పిపిఎఫ్ క్యాలిక్యులేటర్ ప్రకారం 15 సంవత్సరాల తర్వాత మీ రూ.9 లక్షలు అవుతుంది. ఈ పెట్టుబడి పై 7.1 శాతం వడ్డీతో రూ.7.27 లక్షలు పొందుతారు అలా 15 సంవత్సరాల తర్వాత మీ చేతికి మొత్తం రూ. 16 లక్షలు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: