7 రూపాయల ఆదాతో 60 వేల పెన్షన్ పొందండి!

Purushottham Vinay
అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana) 2015 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఈ పథకం అసంఘటిత రంగాలలో పనిచేసే వ్యక్తుల కోసం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు వున్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో డిపాజిటర్లు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ ని పొందడం ప్రారంభిస్తారు. ఈ పథకం కింద మీరు నెలవారీ మినిమం రూ.1,000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, గరిష్టంగా రూ. 5,000 పెన్షన్ ని పొందవచ్చు. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే సేవింగ్స్ ఖాతా, ఆధార్ నంబర్ ఇంకా అలాగే మొబైల్ నంబర్ కలిగి ఉండాలి.ఈ పథకం ప్రయోజనాల విషయానికి వస్తే..ఇక ఈ ప్రభుత్వం పథకంలో ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అంత ఎక్కువ ప్రయోజనం అనేది పొందుతారు. ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో కనుక చేరినట్లయితే 60 సంవత్సరాల వయస్సు తర్వాత అతను ప్రతి నెలా కూడా రూ. 5000 నెలవారీ పెన్షన్ పొందుతాడు. ఇందుకోసం అతడు నెలకు కేవలం రూ. 210 ని డిపాజిట్ చేస్తే సరిపోతుంది. అంటే ప్రతిరోజూ కూడా రూ. 7 డిపాజిట్ చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ ని వారు పొందవచ్చు. అది ఏడాదికి 60,000లు అవుతుంది.


ఇక అదే సమయంలో మీరు ప్రతి నెలా కూడా 42 రూపాయలు డిపాజిట్ కనుక చేస్తే నెలవారీ పెన్షన్ 1000 రూపాయలు పొందోచ్చు. రూ.2000 పెన్షన్ కావాలంటే రూ.84 పెట్టుబడిని పెట్టాలి. అలాగే నెలవారీ పెన్షన్ రూ. 3000 కావాలంటే నెలకి రూ.126 పెట్టుబడిని పెట్టాలి. నెలవారీ రూ.4000 పెన్షన్ పొందాలనుకుంటే ప్రతి నెలా కూడా రూ.168 డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది.ఇక ఈ పథకం అతిపెద్ద లక్షణం ఏంటంటే ఇందులో పన్ను ప్రయోజనం ఉంటుంది. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఆదాయపు పన్ను(Income Tax) చట్టం 80C కింద రూ. 1.5 లక్షల దాకా పన్ను ప్రయోజనం పొందుతారు.ఇక ఈ పథకం కింద పెట్టుబడిదారుడు 60 ఏళ్లలోపు చనిపోతే అతని భార్య/భర్త ఈ పథకంలో డబ్బును డిపాజిట్ చేయడం కొనసాగించవచ్చు. 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు. భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఏక మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. భార్య చనిపోతే ఆమె నామినీకి ఏక మొత్తం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: