మనీ: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!!
పార్లమెంటరీ కమిటీ ప్రకారం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయంలో మార్పులు చేయడం చాలా అవసరం అనిపించింది. అంటే కనీస పెన్షన్ రూ. రెండు వేలకు పైగా పెంచాలని ఈపీఎఫ్ అన్ని పెన్షన్ పథకాలను నిపుణుల ద్వారా మూల్యాంకనం చేయించాలని సమాచారం. తర్వాత నెలవారి సభ్యుల పెన్షన్ ను తగిన మేరకు పెంచవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఉద్యోగుల పెన్షన్ స్కీం ప్రకారం 1995 ని మూల్యాంకనం చేయడానికి 2018 సంవత్సరంలో కార్మిక మంత్రిత్వ శాఖ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇందులో సభ్యులు, వితంతు పింఛన్ దారులకు కనీస నెలవారి పెన్షన్ సుమారుగా రూ.రెండు వేలకు పైగా ఇవ్వాలి అని కమిటీలో సిఫార్సు చేయడం జరిగింది. ఇక ఇందుకు అవసరమైన వార్షిక బడ్జెట్ కేటాయింపులు కూడా చేయాలి అని సూచించింది. అయితే నెలవారి పింఛన్ వెయ్యి రూపాయల నుంచి పెంచడానికి ఆర్థికశాఖ ఏమాత్రం అంగీకరించడం లేదు కానీ పార్లమెంటరీ కమిటీ ప్రకారం చాలా కమిటీలు దీనిపై వివరంగా చర్చించాయి త్వరలోనే కనీసం రూ.2 వేలకు పైగా పెన్షన్ దారులకు లభించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి .. ఇకపోతే కచ్చితంగా దీనిని అమలులోకి తెస్తామని అధికారులు స్పష్టం చేశారు.