మనీ: 20 పైసల షేర్ తో.. లక్షలు ఆదాయం..!!

Divya
ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెప్పవచ్చు. చాలామంది రిస్కు ఉంటుంది అని తెలిసినప్పటికీ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కొన్ని కంపెనీల స్టాక్స్ నష్టాలు తీసుకొస్తే మరికొన్ని షేర్స్ మాత్రం లాభాలు కొడుతున్నాయి. అంతేకాదు కళ్లు చెదిరేలా లాభాలను తీసుకొచ్చి పెడుతుండటం గమనార్హం. ఇక ఈ సంవత్సరం ఎన్నో కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట కురిపిస్తున్నాయి. అలాంటి వాటిలో ఖూబ్ సూరత్ లిమిటెడ్ కూడా ఒకటి. కొన్ని రోజుల నుంచి ఈ స్టాక్ మార్కెట్ నిరంతరం అప్పర్ సర్క్యూట్లు తాకుతూ ఉండడం గమనార్హం.

ఇకపోతే గత ఆరు నెలల వ్యవధిలో స్టాక్ మార్కెట్  ఏకంగా ఒక్కొక్క షేర్ ధర దాదాపుగా 1, 975 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. అంతేకాదు ఇందులో పెట్టుబడి పెట్టినవారికి కూడా బాగా కాసులు వర్షం కురిపిస్తూ ఉండడం విశేషం. ఇకపోతే ఖూబ్ సూరత్ కంపెనీ యొక్క షేర్ ధర 20 పైసలు ఉండగా ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.4.15 వద్ద పలుకుతోంది. అంటే కేవలం నాలుగు నెలల్లో ఏకంగా 1975 శాతం ర్యాలీ చేసి మంచి లాభాలను అందిస్తుంది. లేకపోతే 2022 లో ఇప్పటివరకు 698.08 శాతం రాబడిని ఇవ్వడం గమనార్హం. దీని యొక్క షేర్ విలువ ఒక నెలలోనే.. రూ.1.79 నుంచి ఏకంగా రూ.4.15 పెరిగింది. అంటే కేవలం నెల రోజుల్లోనే 131.84 శాతం పెరిగింది.

ఈ ఖూబ్ సూరత్ లిమిటెడ్ స్టాక్ లో సుమారుగా నాలుగు నెలల క్రితం పెట్టుబడిదారుడు ఏకంగా లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఉండి ఉన్నట్లయితే.. ఈ రోజు మొత్తంగా రూ 20.75 లక్షలు అతని చేతికి వచ్చేది. అంటే కేవలం నాలుగు నెలల్లోనే ఎంతటి పేదవాడైనా సరే లక్షాధికారి అయ్యేవాడు. అందుకే చాలామంది ఆచితూచి అడుగులు వేస్తూ సరైన షేర్ మార్కెట్ ను పెంచుకుంటూ డబ్బులు ఇన్వెష్ట్ చేస్తున్నారు. అలాగే కొన్ని లక్షల రూపాయలను లాభాలు కింద పొందుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: