మని: ఉద్యోగులకు శాశ్వతంగా HRA కట్.. కారణం ఏమిటంటే..!
చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించాయి.. కాకపోతే మరి కొన్ని కంపెనీలు ఆఫీసుకు వచ్చి పని చేయాలని చెప్పిన విషయం తెలిసిందే.కొన్ని కంపెనీలు కొత్త కొత్త వేరియంట్లు రావడంతో ఉద్యోగుల ఆరోగ్య రీత్యా ఇంటి నుంచి ఉద్యోగం చేసుకోమని కూడా సలహా ఇచ్చాయి.ఇక సరికొత్త పని వాతావరణానికి అనుగుణంగా వుండేలా జీతాల స్వరూపాన్ని కూడా సవరించాలని ప్రభుత్వం భావిస్తోందట. అటు ఉద్యోగులు, ఇటు యజమానులకు కూడా ఇబ్బందులు లేకుండా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్ ,కరెంటు తో సహా ఇతర ఖర్చులను ఉద్యోగే స్వయంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే వీటిని యజమాని చేత ఇప్పిస్తారని తెలిసింది. అలాగే టైర్-2, టైర్-3 నగరాల్లో ఉద్యోగి నివసిస్తే.. అది ప్రతిబింబించేలా పరిహారం కింద ప్యాకేజీని కూడా మారుస్తారు. ముఖ్యంగా ఈ ప్రభావం హెచ్ఆర్ఏ పైనే ఎక్కువ ప్రభావం పడనుంది. నిజం చెప్పాలంటే మనకిచ్చే హెచ్ఆర్ఏ అలవెన్స్ ను కట్ చేసి.. ఇంటర్నెట్ ,కరెంటు ,మౌలికవసతుల రూపంలో యాడ్ చేయనున్నట్లు సమాచారం..కాబట్టి ఈ హెచ్ఆర్ఏ కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.