మనీ : ఈ కారు కొంటే , ఏకంగా రూ.90వేలు తగ్గింపు..!

Divya
ఇటీవల కాలంలో ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణించాలి అనుకుంటే బస్సులు, రైళ్లు, ఆటోలు అంటూ ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే సమయం వృధా అవడంతో పాటు వీటిల్లో కరోనా కూడా వ్యాప్తి చెందుతుంది అనే భయంతో ప్రతి ఒక్కరూ సొంత వాహనం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ మీరు కూడా కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటే మీకు ఒక శుభవార్త.. ఒక కారు ఉత్పత్తి కంపెనీ , తమ కారు ను కొనుగోలు చేస్తే ఏకంగా 90 వేల రూపాయలను తగ్గిస్తామని కూడా ప్రకటన చేయడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆ కంపెనీ ఏదో కాదు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయినటువంటి డాట్సన్ ఇండియా. ఈ పండుగ సీజన్ కారణంగా ఏకంగా ఇంతటి పెద్ద ఆఫర్ ను  ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ పండుగ ఆఫర్ లో ఎవరైనా కారును కొనుగోలు చేస్తే , వాళ్లకు 90 వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక అంతే కాదు కేరళ రాష్ట్రంలో ఎంతో అద్భుతంగా జరుపుకునే పండుగ ఓనం  కు కూడా మరో అదిరిపోయే ఆఫర్ ను  ప్రకటించింది ఈ కంపెనీ.
కేరళా వాసులు వీరి కంపెనీకి సంబంధించిన కారును కొనుగోలు చేస్తే, వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ను ఉచితంగా పొందవచ్చు. అలాగే 20,000 రూపాయల వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. ఇక అంతే కాదు ఎవరైనా తమ పాత కార్లను ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే, వాటిపైన 20 రూపాయల ఎక్స్చేంజి ఆఫర్ ను  కూడా సొంతం చేసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఒక కారు కొనుగోలు చేస్తే రూ. 90 వేల వరకు ఆఫర్ ను  పొందవచ్చు అని డాట్సన్ ఇండియా కంపెనీ ప్రకటించడం జరిగింది.
అంతేకాదు 5.99 శాతం వడ్డీ ధరలకే కారుపై లోను కూడా పొందవచ్చు. ఇకపోతే డాట్సన్ గో ప్లస్, డాట్సన్ గో కార్లు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే, ఈ ఆఫర్లు వర్తిస్తాయి అనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: