మనీ : రోజుకు రూ. 25 ఆదా చేస్తే .. రూ.5 లక్షలు మీ సొంతం..

Divya
డబ్బు అనేది ప్రతి ఒక్కరు తప్పకుండా ఆదా చేయాలి. ఎందుకంటే భావితరాల వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోకుండా, వారితో పాటు మనం కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, ఇప్పటినుంచే డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకుంటే, జీవితంలో ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా బ్రతకవచ్చు. ముఖ్యంగా ఎవరైతే తక్కువ మొత్తంతో ఎక్కువ రాబడి పొందాలి అని ఆలోచిస్తున్నారో, అలాంటి వారికి పలు సంస్థలు కొన్ని రకాల పథకాలతో పాటు సరికొత్త స్కీమ్ లను  ప్రవేశపెట్టి, తమ కస్టమర్లను ఆర్థికంగా మరింత అభివృద్ధి చేయడానికి తమ వంతు సహాయంగా తోడ్పడుతున్నాయి. అయితే ఆ పథకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశీయ బీమా దిగ్గజం అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్.. తమ కస్టమర్ల కోసం ఒక వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది . ఆ పథకం ఏదో కాదు జీవన్ లాభ్ పాలసీ స్కీం. ఇందులో ప్రతి నెల 800 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వల్ల , మీకు  నిర్ణీత కాలంలో ఏకంగా  ఐదు లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. అంటే ఇందులో మీరు ప్రతిరోజు 25 రూపాయలు ఆదా చేస్తూ , నెలకు 800 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలన్న మాట. అయితే ముందుగా ఈ పాలసీ లో చేరడానికి ఎవరెవరు అర్హులు.. అంటే, ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికల నుంచి 59 సంవత్సరాల కలిగిన వృద్ధుల వరకు ఈ పథకంలో చేరడానికి అర్హులు.
ఈ పాలసీలో 3 టర్మ్  లు మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే పదహారేళ్ల  టర్మ్ కు 10 సంవత్సరాలు.21 యేళ్ళ టర్మ్ కు పదహేను సంవత్సరాల తో పాటు 26 యేళ్ళ టర్మ్ కు పదహారు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరు తమ వయసుకు తగ్గ పాలసీ టర్మ్ ని తీసుకొని, అందులో నిర్ణయించబడిన సంవత్సరాలకు గాను , ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించడం వల్ల నిర్దిష్ట కాలం ముగిసేసరికి, మీ  చేతికి ఐదు లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రాబడిని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: