ప్రభాస్ విషయంలో వేణుస్వామి చెప్పింది నిజమవుతుందా...?

murali krishna
సెలెబ్రేటి ల గురించి జోష్యం చెప్పే వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. అందుకు కారణం అతని చెబుతున్న జోష్యం చాలామంది విషయంలో నిజం కావడమేనని సమాచారం.దాంతో వేణు స్వామి టాలీవుడ్ లో కానివ్వండి, ఇటు రాజకీయంగా కానివ్వండి ఎవరి గురించి ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ చెప్పిన కూడా అది తెగ వైరల్ అవుతుంది. వేణు స్వామి ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ అంటేనే ఫాన్స్ కి కొంత ఒణుకు పుడుతుంది అలా ఉంది మరీ ఆయన శాస్త్రం.వేణు స్వామి మొదటగా నాగచైతన్య,సమంత విడిపోతారు అని చెప్పగా అది నిజంగా నే జరిగింది, వేణు స్వామి చెప్పిన్నట్టే నాగచైతన్య సమంత విడిపోతారని అంచనా వేశారు అప్పట్లో అది సంచలనంగా అయితే మారింది. అయితే అది ఇటీవల నిజమైంది. దాంతో వేణు స్వామి భవిష్యత్తును చూడగల ఒక గొప్ప ఆస్ట్రాలజర్ అనే పేరు వచ్చింది.. అలాగే వేణు స్వామి మరో టాలీవుడ్ కపుల్స్ పైన సెన్సషనల్ కామెంట్స్ ను చేసాడు.
అంతేకాదు రామ్ చరణ్ ఉపాసన ఆలస్యంగా బిడ్డను కంటారని కూడాఆయన ఒక ప్రిడిక్షన్ చేశారు అది కూడా ఇప్పుడు నిజమైంది. అదే విధంగా రెండు నెలల క్రితం అతను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యువ నటుడు చనిపోతాడు అని కూడా జోష్యం ను చెప్పాడు. తారకరత్న రూపంలో అది కూడా నిజమైంది. టాలీవుడ్ యాక్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని చెప్పగా అది వరుణ్ తేజ్ మరియు లావణ్యల విషయంలో నిజమైంది. ఇలా వేణు స్వామి చెబుతున్న చాలా మాటలు అన్నీ కూడా నిజమవుతూ అతడిని మరింత పాపులర్ ను చేస్తున్నాయి. అతను చెప్పిన మరికొన్ని జోష్యాలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రభాస్ 2023 జాతకం అంతగా బాగోలేదని చెప్పడం కూడా ఉంది.ఇది నిజమవుతుందేమోనని అభిమానులు తెగ బాధపడుతున్నారు. వేణు స్వామి చెప్పిన వాటిలో చాలావరకు చెడు సంఘటనలే ఉన్నాయని తెలుస్తుంది.. ఆయన చెప్పిన చెడులన్నీ కూడా నిజమయ్యాయి. ఇక భవిష్యత్తులో అతను ఇంకెన్ని భయంకరమైన జోష్యాలు చెబుతాడోనని టాలీవుడ్ అభిమానులు కంగారు పడుతున్నారు.మరికొందరు అభిమానులు చెడు విషయాలను ముందే చెప్పకపోవడం మంచిదని  కూడా అంటున్నారు. ఇంకొందరు చెడు వదిలేసి మంచి విశేషాలు మాత్రమే చెప్పాలని కూడా కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: