సలార్ : 400 మందితో రెబలోడి ఫైట్..?

Purushottham Vinay
ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ తో నేషనల్ స్టార్ అయిన ప్రభాస్ అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస పాన్ ఇండియా సినిమాలతో స్పీడ్ గా దూసుకుపోతోన్నాడు. తన సినిమాల ఫలితాలను ఏమాత్రం లెక్క చేయకుండా వరుసగా మూవీలు చేస్తూనే ఉన్నాడు. అలా తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా వినోదాన్ని అందిస్తున్నాడు. అలా ఇప్పుడు ప్రభాస్ ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు చేస్తోన్నాడు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా వస్తోన్న 'సలార్' సినిమా ఒకటి. 'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్.. కొన్ని కొన్ని బ్రేక్స్ పడుతూ సాగుతోంది. అయినప్పటికీ ఇలా దాదాపు సగం కంటే ఎక్కువ షూటింగ్‌ను మూవీ యూనిట్ పూర్తి చేసుకుంది. అలాగే మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. అనుకున్న సమయానికి ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటోంది.


ఈ నేపథ్యంలో తాజాగా   ఓ క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తుంది.మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' సినిమాలో చాలా హైలైట్లు ఉండబోతున్నాయని ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పింది. ఈ క్రమంలోనే తాజాగా  ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.  ఈ మూవీలో క్లైమాక్స్ ఎపిసోడ్ అనేది అసలు తెలుగులో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారట. ఇంకా అంతేకాదు, ఇందులో ప్రభాస్ ఏకంగా 400 మంది ఫైటర్లతో ఫైట్ చేయబోతున్నాడని తెలిసింది. ఈ ఎపిసోడ్ కోసమే విదేశాలకు చెందిన టెక్నీషియన్లను తీసుకుంటున్నారనే సమాచారం వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఈ చిత్రంలోనే హైలైట్ కాబోతుందని సమాచారం.భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.అలాగే జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్‌లుగా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: