రమా ప్రభతో విడిపోవడంపై శరత్ బాబు ఏం చెప్పారంటే..?

Divya
తెలుగు తమిళ్ చిత్రాలలో విలక్షణమైన నటుడుగా పేరుపొందిన నటుడు శరత్ బాబు ఈ రోజున కన్నుమూయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న హైదరాబాద్లో AMG హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.అయితే పరిస్థితి చేయి దాటడంతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు తెలియజేయడం జరిగింది. సినిమాలలో వివాదాలకు దూరంగా ఉండే ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా తనకంటే వయసులో ఐదు సంవత్సరాలు పెద్దదైన రామ ప్రభ ను ప్రేమించి వివాహం చేసుకోవడంతో పాటు మనస్పర్ధలు రావడం చేత విడిపోవడం జరిగింది.

అయితే అలా విడిపోయిన తర్వాత శరత్ బాబు తనని మోసం చేశారని ఆస్తి లాక్కున్నారంటూ రమా ప్రభ కొన్ని ఇంటర్వ్యూలలో తెలిపింది. అయితే ఈ వార్తలను శరత్ బాబు సైతం ఒక ఇంటర్వ్యూలో ఖండించడం జరిగింది.. రమా ప్రభ కు అస్సలు ఆస్తులు లేవని ఒకే ఒక ఆస్తి ఉంటే దాన్ని ఆమె తన పేరు మీద తన తమ్ముడు పేరు మీద మూడు ఆస్తులను కొన్నట్లుగా తెలిపారు.. తానే ఆమెకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చానని తెలియజేయడం జరిగింది. రమా ప్రభ పెళ్లి జరిగినప్పుడు తన వయసు 22 సంవత్సరాలు మాత్రమేనని రమా ప్రభ తనకంటే ఐదారేళ్ళు వయసులో పెద్దదని ఆ వయసులో తాను ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది తొందరపాటు నిర్ణయమని తెలిపారు.
రమా ప్రభ కు తనకు జరిగిన పెళ్లి ఒక కల అంటూ ఇంటర్వ్యూలో తెలిపారు. 1973లో రామరాజ్యం సినిమా ద్వారా శరత్ బాబు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న శరత్ బాబు తెలుగు తమిళ చిత్రాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా 250 కు పైగా సినిమాలలో నటించారు. కానీ ఈ రోజున ఆయన మరణ వార్తతో అటు సినీ ఇండస్ట్రీ ఇటు అభిమానుల సైతం శోకసముద్రంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: