హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ' అంతఃపురం ' మువీ బుడ్డోడు.....!!

murali krishna
1998లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రకాష్ రాజ్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించగా.. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా అనేక అవార్డ్స్ అందుకుంది. ఇందులో సౌందర్య నటనకుగానూ ఆమెకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు.
డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అంతఃపురం ఒకటి. సాయి కుమార్, దివంగత నటి సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1998లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రకాష్ రాజ్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించగా.. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా అనేక అవార్డ్స్ అందుకుంది. ఇందులో సౌందర్య నటనకుగానూ ఆమెకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులలో మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ చిత్రం. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా ఇందులో తన కొడుకు కోసం ఓ తల్లి పడే తపన.. పోరాటం.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తల్లిగా తన నటనతో సౌందర్య నటనకు ఆడియన్స్ ను కంటతడి పెట్టించింది. ఇందులో సౌందర్య తనయుడిగా కనిపించిన చిన్నోడి పేరు కృష్ణ ప్రదీప్. కేవలం రెండేళ్ల వయసులోనే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో కనిపించలేదు ఈ అబ్బాయి. చదువు దెబ్బతినకూడదని కృష్ణ ప్రదీప్ తల్లిదండ్రులు అతడిని సినిమాలకు దూరంగా ఉంచారు. అంతఃపురం సినిమా రిలీజ్‌ అయ్యి 25 ఏళ్ళు. అంటే ప్రస్తుతం కృష్ణ ప్రదీప్ వయసు 27 ఏళ్ళు.
ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ కుర్రాడు.. ఇప్పుడు హీరోగా అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. హీరోలకు ధీటుగా మంచి ఫిజిక్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: