ఏజ్ గ్యాప్ ఉన్నా పెళ్లి కి సిద్ధం అవుతున్న జంట...!!

murali krishna
అక్కినేని నాగార్జున మేనకోడలు, నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ, హీరో అడవి శేషు త్వర లో పెళ్లి పీటలు ఎక్కబోతు న్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. అక్కినేని వారి ఇంట జరిగే శుభకార్యాల్లో శేష్కనిపించడం తో పాటు వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సుప్రియ, అడవి శేష్ పెళ్లికి శేష్ కుటుంబం ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
వీరి పెళ్లి త్వరలో జరగబోతుందట. ఈ పెళ్లిని అక్కినేని నాగార్జున దగ్గరుండి జరిపిస్తారని సమాచారం. జూన్16న సుప్రియ, శేషు ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది. సుప్రియ కు తండ్రి సురేంద్ర యార్లగడ్డ, తల్లి సత్యవతి యార్లగడ్డ, సోదరుడు సుమంత్ ఉన్నారు. తల్లి సత్యవతి మరణించారు. సుప్రియ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆమె నటన కు దూరం గా ఉండాలని నిర్ణయించుకుని సినీ నిర్మాణం లోకి వచ్చారు.
1997 ఆమె ఆహా చిత్రాన్ని నిర్మించారు. 2000లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ గా మారింది. ఒక‌ప్పటి హీరో చ‌ర‌ణ్ ను సుప్రియ పెళ్లి చేసుకుంది. సుప్రియ భ‌ర్త చ‌ర‌ణ్ కూడా మ‌ర‌ణించారు. 2018 లో ఆమె గూడాచారి సినిమా చేశారు. ఈ సినిమా తోనే ఆమెకు, అడవి శేష్ పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు లవ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అడవి శేష్ సొంతం (2002) చిత్రం లో ఒక చిన్న అతిథి పాత్ర లో నటుడి గా పరిచయం అయ్యాడు. 2010 చిత్రం కర్మ లో దర్శకుడి గా, రచయిత గా అరంగేట్రం చేశాడు.2016లో క్షణం సినిమా తో హిట్ సాధించిన అతను అప్పటి నుంచి క్రమం తప్ప కుండా సినిమాలు చేసు కుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం సుప్రియ వయస్సు 45 ఏళ్లు కాగా అడవి శేష్ వయస్సు 38 సంవత్సరాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: