అక్కినేని హీరోలు ఇద్దరూ కలిసి అన్ని కోట్ల నష్టాన్ని మిగిల్చారా..!?

Anilkumar
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన తాజా సినిమా కస్టడీ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా మిగిలింది. తెలుగు తో పాటు తమిళ భాషలో సైతం విడుదలైన ఈ సినిమా రెండు రోజులకే సైలెంట్ అయిపోయింది. ఈ సినిమాతో అయినా నాగచైతన్య హిట్ ఇస్తాడని అనుకున్న అక్కినేని ఫ్యాన్స్ కి ఊహించని దెబ్బ తగిలింది. దీంతో ఈసారి కూడా అక్కినేని ఫ్యాన్స్ అసలు నిరాశగా మిగిలిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అక్కినేని అభిమానులకు ఒకేసారి రెండు గట్టి దెబ్బలు తగిలాయి. ముందు ఏప్రిల్ 28న స్పై థ్రిల్లర్ గా ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అఖిల్ ఏ సినిమాతో కూడా సక్సెస్ కాలేకపోయాడు. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో సమ్మర్లో మాస్ జాతర చేయాలని అనుకున్న అఖిల్ ఏజెంట్ సినిమాతో కూడా ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాను అనుకున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఫస్ట్ షోకే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. అనంతరం రెండవ రోజు నుండి ఊహించనిడిజాస్టర్ గా మిగిలింది.ఇక ఈ సినిమాకి థియేట్రికల్ ద్వారా ఆరు కోట్లకు పైగానే షేర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా వచ్చిన ఈ సినిమా మొత్తంగా 30 కోట్లకు పైగా అని నష్టాలను మిగిల్చినట్లుగా తెలుస్తోంది. దీంతో భారీ నష్టాలు మిగిలిన సినిమాల్లో ఏజెంట్ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.

అనంతరం నాగచైతన్య హీరోగా నటించిన కష్ట్రీ సినిమా సైతం అఖిల్ నటించిన ఏజెంట్ రేంజ్ లో బిజినెస్ చేయలేకపోయినప్పటికీ నష్టాలను మాత్రం బాగానే మిగిలినట్లుగా తెలుస్తోంది .మొత్తంగా చూసుకుంటే కష్టడి సినిమా 20 కోట్లకు పైగా అన్ని నష్టాలను తెచ్చి పెట్టిందట. అయితే ఈ లెక్కన చూసుకుంటే అక్కినేని ఇద్దరు హీరోలు కూడా ఫ్యాన్స్ తో పాటుగా బిజినెస్ వర్గాలకు కూడా షాక్ ఇచ్చారు. ఇక ఇలాంటి ఒక డిజాస్టర్ నుండి వెంటనే బయటికి వచ్చి వీరిద్దరూ మంచి హిట్ సినిమాలు అందుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: