'NTR30' కోసం భారీ సెట్..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి కమర్షియల్ హిట్టవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూవీ టీం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

ఇక తాజా షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక సెట్లో సుమారు పది రోజులు షూటింగ్ జరపనున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ జాన్వి కపూర్ కూడా జాయిన్ కానుంది. వచ్చేవారం నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక ఈ షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ మరోసారి తన లుక్ మొత్తాన్ని మార్చుకోబోతున్నాడు.ఈ పది రోజుల షూటింగ్లో చివరి నాలుగు రోజులు పాటు ఇతర నటీనటులతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నారట దర్శకుడు కొరటాల శివ. ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నాయట.

ముఖ్యంగా సముద్రంలో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు అయితే సినిమాకే మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ లను ప్రముఖ హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కి కెన్ని బేట్స్ తెరకెక్కిస్తుండడం విశేషం. హై వోల్టేజ్ యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తారట. బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: