అఫీషియల్ : డబ్బింగ్ పనులను ప్రారంభించిన "భోళా శంకర్" మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి అజిత్ హీరో గా రూపొందిన వేదాలం అనే మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. భోళా శంకర్ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
 

ఈ మూవీ లో కీర్తి సురేష్ ... చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తూ ఉండగా ... టాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఫోటో ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. వాల్టేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా కావడంతో భోళా శంకర్ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: