NTR30: హాట్ టాపిక్ గా మారిన జాన్వీ కపూర్ రెమ్యునరేషన్.. అన్ని కోట్లా..?

Anilkumar
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 30 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ వెండితెరకు పరిచయం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా కోసం జాన్వి కపూర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే చర్చ మూవీ స్టార్ట్ అవ్వకముందే మొదలైంది. ఇక సినిమాకి క్లాప్ కొట్టిన తర్వాత జాన్వి కపూర్ రెమ్యునరేషన్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ మూవీ కోసం జాన్వికపూర్ ఏకంగా నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసింది. 

కానీ అది నిజం కాదట. లేటెస్ట్ టాక్ ప్రకారం NTR30 కోసం ఏకంగా ఐదు కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటుందట. జాన్వి కపూర్ ప్రస్తుతం చిత్ర యూనిట్ నుండే ఈ వార్తలు లీక్ అవుతున్నాయి. ఇప్పటివరకు సౌత్ స్టార్ హీరోయిన్స్ ఎవరు ఈ రేంజ్ లో పారితోషకం అందుకోలేదు. ఫస్ట్ టైం జాహ్నవి కపూర్ ఈ రేంజ్ లో డిమాండ్ చేసిన మూవీ యూనిట్ ఆమెకు అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారట. అయితే ఈ హీరోయిన్ కంటే ముందు గతంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఐదు కోట్లు తీసుకుందట. దాదాపు అదే రేంజ్ లో మరో బాలీవుడ్ డ్యూటీ కియారా అద్వానీ కూడా ఛార్జ్ చేస్తోందట.

ఇక వాళ్లకంటే తగ్గితే బాగుండదని జాన్వికపూర్ కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేసిందని అంటున్నారు. నిజానికి అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వి కపూర్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఆ క్రేజ్ ని జాన్వి ఇలా క్యాష్ చేసుకుంటుంది. కాగా అటు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి అంతంతమాత్రంగానే పాపులారిటీ ఉంది. ఇప్పటివరకు బాలీవుడ్లో జాన్వికి సాలిడ్ హిట్టు లేదు. అటు పెద్ద హీరోలతోనూ నటించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ తో టాలీవుడ్ లో ఈ బ్యూటీ కనక సక్సెస్ అయితే బహుశా ఇక్కడే సెటిల్ అయిపోతుందేమో చూడాలి. అన్నట్టు తెలుగులో ఎన్టీఆర్ సినిమాతో పాటు రామ్ చరణ్, మహేష్ బాబు లతో కూడా ఈ హీరోయిన్ కి నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే వీటిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: