అల్లు అర్జున్ ఆ బ్లాక్ బాస్టర్ మూవీకి ఆరేళ్లు..!

Pulgam Srinivas
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమాలలో సరైనోడు మూవీ ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ... క్యాథరిన్ హీరోయిన్ లుగా నటించారు. ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 22 ఏప్రిల్ 2016 వ సంవత్సరం విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇలా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ సినిమా నేటితో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానానికి బోయపాటి శ్రీను కు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు ఆది పినిశెట్టి కి రకుల్ ప్రీత్ సింగ్ కు  క్యాథరిన్ కు  ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: