రెండవ రోజు సుకుమార్ పైన కొనసాగుతున్న ఐటీ దాడులు..!!
సుకుమార్ పుష్ప రంగస్థలం తదితర సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తో కూడా సుకుమార్ కు మంచి అనుబంధంగా ఉండడంతో వీరిద్దరి ఆఫీస్ పైన రైట్స్ జరగడం అందరిని ఆచార్యానికి గురిచేస్తోంది. అయితే ఇందుకు కారణం గత ఏడాది డిసెంబర్ తర్వాత నాలుగు నెలల లోపే రెండవసారి విదేశాల నుంచి నిధులు తీసుకురావడం ద్వారా పెట్టుబడి ఇలా నిబంధనలు ఉల్లంఘించినందుకు వారి ఆర్థిక లావాదేవుల రికార్డులను అధికారులు తనిఖీ చేసినట్లుగా సమాచారం. అయితే ఇక్కడ ఆశ్చర్య దగ్గర విషయం ఏమిటంటే సుకుమార్ ఆఫీస్ పైన కూడా ఐటి రైట్స్ జరుగుతున్నాయి.
సుకుమార్ కూడా తన సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించి అలాగే మైత్రి మూవీస్ తో కలిపి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుకుమార్ తన సినిమాల ద్వారా వచ్చిన లాభాలతో శంకరపల్లి మెయినాబాద్ లలో 100 ఎకరాలు కలిగిన పొలాలను కొన్నట్టుగా ఐటి అధికారులు గుర్తించినట్లు సమాచారం .అయితే ఇప్పటికి కూడా సుకుమార్ ఆస్తులపైన ఇంకా ఐటీ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప, శ్రీమంతుడు, సర్కారు వారి పాట, రంగస్థలం,డియర్ కామ్రేడ్ ,వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచారు. ఇవే కాకుండా పలు సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నిబంధనలను పాటించకుండా ఇతర దేశాల నుంచి రూ .500 కోట్ల రూపాయల పెట్టుబడికి ప్రొడక్షన్ హౌస్ అనుమతించిందని ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.