మరో తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్న దళపతి విజయ్..!!
ఈ ఏడాది సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారిసు సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రం ఓవరాల్ గా రూ.300 కోట్ల రూపాయలను కలెక్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన చిత్రాలలో ఈ సినిమా కూడా ఒకటి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. తెలుగులో ఈ సినిమాని వారసుడు అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా తెలుగులో వాయిదా పడేసరికి ఇక మీదట విజయ్ తెలుగు దర్శకులతో సినిమా చేయాడని అందరూ అనుకున్నారు.. కానీ ప్రస్తుతం విజయ్ ,లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న లియో చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సినిమా మోస్ట్ అవైడెడ్ సినిమా గా మారుతోంది.ఈ సినిమా షూటింగ్ జూలై నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత విజయ్, అట్లీ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోంది ఈ సినిమాతో హ్యాట్రిక్ హీట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డైరెక్టర్ బాలయ్యతో ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి విజయ్ గోపీచంద్ కాంబినేషన్లో సినిమా ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉన్నది.