'గేమ్ ఛేంజర్' స్టోరీ ని రివీల్ చేసిన దిల్ రాజు.. రామ్ చరణ్ కి హిట్ పక్కా..!!

Anilkumar
దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రోబో 2.0 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మొదలై ఏడాది పైగా దాటిన ఈ మూవీకి సంబంధించి జోనర్ ఏంటన్నది ఇప్పటివరకు మూవీ టీం రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ మూవీ జోనర్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ..' ఓ సామాజిక సమస్య నేపథ్యంలో సాగే రివెంజ్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని అన్నాడు. శంకర్ సినిమాల తరహాలోనే మంచి కమర్షియల్ వాల్యూస్ తో పాటు ఓ సోషల్ మెసేజ్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే గ్రాఫిక్స్, వి ఎఫ్ ఎక్స్ వంటివి ఈ మూవీలో కాస్త తక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు. ఇక జెంటిల్మెన్, భారతీయుడు సినిమాల తరహాలోనే గేమ్ చేంజర్ మూవీ పోలి ఉంటుందని అన్నాడు.ఇక సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. అది కూడా తండ్రి కొడుకులుగా. అవినీతిపై పోరాడే ఐఏఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ ఓ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ నుంచి టీజర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా సినిమాని విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సునీల్, శ్రీకాంత్, తమిళ నటుడు ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: