ట్రైలర్: ఆకట్టుకోలేకపోతున్న పొన్నియన్ సెల్వన్-2 ట్రైలర్..!!

Divya
డైరెక్టర్ మణిరత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ చిత్తాన్ని గత ఏడాది విడుదల చేసి పరవాలేదు అనిపించుకున్నారు. ఇక మొదటి భాగం దాదాపుగా తమిళనాడులో రూ .200 కోట్ల రూపాయలను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ .400 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో కార్తీ, విక్రమ్, జయం ,రవి ,త్రిష ఐశ్వర్యరాయ్, శోభిత ,ప్రకాష్ రాజ్ తదితరులు సైతం నటించారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించడం జరిగింది.పొన్నియన్ సెల్వన్-1 లో కేవలం తమిళనాడులో మాత్రమే బాగా సక్సెస్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా పొన్నియన్ సెల్వన్ -2 చిత్రం కోసం తమిళ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ని నిర్వహించారు చిత్ర బృందం. ఇందులో నటించిన స్టార్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది.పొన్నియన్ సెల్వన్-1 సినిమా ప్రమోషన్స్ కి రజనీకాంత్ కమలహాసన్ వచ్చి  మంచి హైట్ చేశారు. అయితే తాజాగా పొన్నియన్ సెల్వన్-2 చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మాత్రం కమలహాసన్ ముఖ్యఅతిథిగా రావడం జరిగింది.

ఇక ట్రైలర్లు ఎక్కువగా అన్ని యుద్ధాలు ఒకరిపై ఒకరు పన్నాగాలు ఎత్తుకు పై ఎత్తు వంటివి చూపించడం జరుగుతోంది.. చనిపోయాడనుకుంటున్న పొన్నియన్ సెల్వన్ ఎలా బయటికి వచ్చారు.. చోళులు వర్సెస్ పాండ్యుల కథ మొదటి కథకు కొనసాగింపు ఉండేలా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక థియేటర్లో ఈ సినిమా సందడి చేస్తుందో లేదో తెలియదు కానీ తెలుగులో అయితే అంతగా మ్యాజిక్ చేయలేకపోతోంది ఇప్పుడు..పొన్నియన్ సెల్వన్ -2 తమిళ్లో హిట్ అయిన తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది ఇంకో నెల రోజుల్లో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: