ధమ్కీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్..!!

Divya
విశ్వక్సేన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ధమ్కీ. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నివేద పేతురాజ్ నటించింది. రావు రమేష్, హైపర్ ఆది, అజయ్, రోహిత్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.ధమ్కీ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు చిత్ర బృందం. గ్లోబల్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ వేదికకి రాబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులోని శిల్పకళా వేదికలో రేపటి రోజున సాయంత్రం 6 గంటల నుండి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వన్మయే క్రియేషన్ అలాగే విశ్వక్ సినిమాస్ బ్యానర్ పై కరాటే రాజు నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రానికి లియాన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.ధమ్కీ  సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు ఒక విధంగా విశ్వక్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక స్క్రీన్ లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడతారని విషయంపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. rrr చిత్రం లో నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ఎన్టీఆర్ ఈ వేడుకకు అనంతరం ఈ ఈవెంట్లో పాల్గొంటూ ఉండడంతో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతోంది. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కూడా మొదలుపెట్టబోతున్నారు.ఈ సినిమా షూటింగ్ గత నెలలోనే మొదలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడడం జరిగింది. అలాగే ఆస్కార్ వేడుకకు హాజరు కావాల్సి ఉండగా మరింత ఆలస్యం అవుతోంది.ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: