త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్.. చరణ్ - తారక్ ఫ్యాన్స్ మధ్య వింత వార్?

praveen
సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు అన్నదమ్ముల్లాగా లేకపోతే ప్రాణ స్నేహితుల్లాగానే కలిసిమెలిసి ఉంటారు అని చెప్పాలి. కానీ ఎందుకో ఆ స్టార్ హీరోల అభిమానులు మాత్రం చిన్న చిన్న విషయాల్లోనే గొడవ పడుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు ఇలా ఎంతోమంది స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూశాము. ఇక మొన్నటికి మొన్న త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైన సమయంలో కూడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

 త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై విజయవంతం అయిన తర్వాత మాత్రం ఇద్దరు హీరోలకు సమానమైన పేరు వచ్చింది అని చెప్పాలి. ఇకపోతే త్రిబుల్ ఆర్ ఇటీవల  ఒక గొప్ప అవార్డును దక్కించుకుంది అని చెప్పాలి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో భారత సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కరు కూడా త్రిబుల్ ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు అని చెప్పాలి. అయితే ఇలా ఆస్కార్ దక్కినందుకు దేశం మొత్తం సంబరాల్లో ఉంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ మధ్య మాత్రం వింత వార్ నడుస్తుంది.

 ఆస్కార్ అవార్డు విషయంలో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ తగువలాడుతూ ఉండడం గమనార్హం. ఎన్టీఆర్ అభిమాని ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ట్విట్ ఆసక్తికరంగా మారిపోయింది. నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కటం  గొప్ప విషయం.. ఇక ఎన్టీఆర్ చేసిన అద్భుతమైన డాన్స్ వల్లే ఇది సాధ్యమైంది అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ గా మారగా ఇది చూసిన చరణ్ ఫాన్స్ తమదైన శైలిలోని రియాక్ట్ అవుతున్నారు అని చెప్పాలి. ఇలా అందరూ ఆస్కార్ సంతోషంలో ఉన్న సమయంలో ఇక ఫ్యాన్స్ మాత్రం ఎప్పటి లాగానే చిన్న విషయాన్ని తెరమీదకి తీసుకువచ్చి మరోసారి సోషల్ మీడియాలో గొడవ పడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: