ప్రభాస్ సినిమా విషయంలో ఆ వార్త నిజం కాదా..?

murali krishna
డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో  భారీ సినిమాలు అయితే వున్నాయి.. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ప్లాప్స్ అవుతున్న క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరి ప్రభాస్ పాన్ వరల్డ్ లెవల్లో చేస్తున్న సినిమానే ''ప్రాజెక్ట్ కే''.. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది.
వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తీస్తున్నారట.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండ గా దీపికా పదుకొనె మరియు అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు. ఈ సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం శరవేగం గా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ గాయ పడిన సంగతి తెలిసిందే.. ఈయన ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స తీసుకుని షూటింగ్ కు విరామం తీసుకున్నారని సమాచారం..
ఈ క్రమంలో నే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వనుందని ముందు గా అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చు అని నిన్నటి నుండి సోషల్ మీడియా లో  తెగ ప్రచారం జరుగుతుంది.. తాజాగా ఈ రూమర్స్ మీద క్లారిటి వచ్చింది.ఇందు లో నిజం అయితే లేదని.. అమితాబ్ బచ్చన్ షూట్ లో పాల్గొనక పోయిన మిగతా పార్ట్ షూట్ పూర్తి చేయనున్నారని సమాచారం.అంతేకాదు విఎఫ్ఎక్స్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతుండడం తో అమితాబ్ కోలుకోగానే ఆయన పార్ట్ షూట్ పూర్తి చేసి ముందుగా ప్రకటించిన విధంగా నే వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుక గా జనవరి 12 న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు యూనిట్ సభ్యులు అయితే చెబుతున్నారు..ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: