అటువంటి రూమర్ ని కొట్టిపడేసిన కోలీవుడ్ ఇండస్ట్రీ....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తో భారీ స్టార్ డమ్ అందుకుని ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఈ మూవీ ఇచ్చిన హిట్ తో ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా వ్యాప్తంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఐతే ఈ క్రమంలోనే తన 30వ మూవీను కొరటాల డైరెక్షన్ లో ఫిక్స్ చేసాడు. ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీగా పేరు పొందిన చిత్రం ''ఎన్టీఆర్30''.
ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ఈ మూవీ ఇంకా షూట్ అయితే స్టార్ట్ కాలేదు ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత షూట్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. యువ సుధా ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా ఫిక్స్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత తన 31వ సినిమా కూడా అఫిషియల్ గా ప్రకటన వచ్చింది. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈయన తన నెక్స్ట్ సినిమాను లైనప్ చేసుకున్నాడు. మరి ఈ సినిమా కొరటాల సినిమా అయిన వెంటనే స్టార్ట్ అవ్వనుంది. ఇదిలా ఉండగా ఈయన లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది అని నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. తాజాగా నిన్న ఒక క్రేజీ కాంబో అంటూ ఎన్టీఆర్, కోలీవుడ్ స్టార్ట్ హీరో ధనుష్ వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబోలో సినిమా రాబోతుంది అంటూ అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అంటూ రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్స్ పై కోలీవుడ్ వర్గాల నుండి ఈ కాంబోపై క్లారిటీ వచ్చింది అదేంటంటే ఈ రూమర్ అనేది వంద శాతం అబద్దం అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుతున్నాయి.
దయచేసి ఇటువంటి రూమర్ క్రియేట్ చేసేవాళ్ళు ఇకనైనా ఆపి వేయాలని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: