ఘనంగా ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ప్రత్యేకతలు ఇవే..!

Divya
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ కొత్త కొత్త వ్యాపారాలను కూడా మొదలు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా అలాంటి వారిలో బెస్ట్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు వాణిజ్య ప్రకటనలతో ఖాళీగా లేకపోయినప్పటికీ కూడా తన భార్య నమ్రత శిరోద్కర్ సపోర్టుతో బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఏషియన్ సంస్థల అధినేత సునీల్ నారంగ్ తో కలిసి ఏ ఎం బి సినిమాస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో అల్లు అర్జున్ కూడా నడవ బోతున్నారు.
నైజాంలో థియేటర్స్ బిజినెస్ లో తనదైన ఉనికిని చాటుతున్న ఏషియన్ సునీల్ నారంగ్ తో కలిసి ఇప్పుడు అల్లు అర్జున్ ఏషియన్ అల్లు అర్జున్ పేరిట మల్టీప్లెక్స్ ను  నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాదు నడిబొడ్డున ఈ మల్టీప్లెక్స్ ను అల్లు అర్జున్ నిర్మిస్తున్నారు. అమీర్ పేటలోని సత్యం థియేటర్స్ స్థలంలో ఈ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇకపోతే ఈ ఏడాదిలోనే వీటిని ప్రారంభిస్తారు అనే వార్త బలంగా వినిపిస్తోంది.  అయితే ఈ విషయంలో మహేష్ బాబు ఏ ఎం బి సినిమాకు దీటుగా AAA మల్టీప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.
ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే లావిష్ షీటింగ్ ఫెసిలిటీ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేలా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని అంతే కాదు తన వర్చువల్ ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారని సమాచారంతోపాటు భారీ టీవీ స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేయబోతున్నారట.  దీనివల్ల ప్రొజెక్టర్ లేకపోయినా సరే సినిమాను వేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ ఇప్పుడు మల్టీప్లెక్స్ వ్యాపారంలో కూడా దూసుకుపోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఒకవైపు సినిమాలంటూనే మరొకవైపు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: