వీరయ్య డైరెక్టర్ తో బాలయ్య..?

Anilkumar
ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హీట్ అందుకున్నాడు దర్శకుడు బాబి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ సినిమాలో దర్శకుడు బాబి మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల ఇమేజ్కు తగ్గట్లు తన దర్శకత్వ ప్రతిభతో అదరగొట్టాడు. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు బాబి. అయితే తాజాగా బాబి త్వరలోనే నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతమున్న యంగ్ జనరేషన్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో బాబి ఇప్పుడు బాలయ్య పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

 ఓ మాస్ మసాలా కథతోనే బాలయ్యను పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నాడట. దర్శకుడు మెగాస్టార్ కి ఒక మాస్ హిట్ ఇచ్చినట్టే బాలయ్యకు సైతం ఒక మాస్ హిట్ ఇవ్వాలని బాబీ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే బాలయ్య కోసం ఓ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ స్క్రిప్ట్ కి బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం ఈ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టును కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తే మాత్రమే బాలయ్య తన కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాజాగా వీరసింహారెడ్డి తో సూపర్ హిట్ అందుకున్న

 బాలయ్య ఇప్పుడు తన తదుపరిచిత్రాన్ని అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఎన్.బి.కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాకి బాలయ్య 20 నుంచి 25 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మరో హీరోయిన్ శ్రీ లీల బాలయ్య కూతురిగా కనిపించనుంది. తారకరత్న మరణం వల్ల ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న బాలయ్య మరికొద్ది రోజుల్లోనే తిరిగి షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారి పాటి హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: