సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను విడిపోవడానికి ఆ అమ్మాయే కారణమా..!?

Anilkumar
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా గెటప్ శ్రీను మరియు సుడిగాలి సుదీర్ ఎంతటి క్రేజ్ ను సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ పంచులతో కామెడీతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇద్దరు కమెడియన్లు. ఎంతో కష్టపడి జబర్దస్త్ కి వచ్చిన అనంతరం మంచి పాపులారిటీని అందుకున్నారు. ఇకపోతే జబర్దస్త్ షోలో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి నుండి వీరు ముగ్గురూ మంచి స్నేహితులు. వీరు ముగ్గురు కలిసి స్కిట్లు చేస్తే కచ్చితంగా ఆ స్కిట్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది .సాధారణంగా వీరు ముగ్గురు ఎప్పుడు కలిసి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఈవెంట్లకి చాలా క్లోజ్ గా హాజరవుతూ ఉంటారు.

 అయితే తాజాగా ఇప్పుడు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ విడిపోయారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గెటప్ శ్రీను ,రాంప్రసాద్ ,సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరు ముగ్గురు విడిపోయారు అని అంటున్నారు.అంతే కాదు గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ కి ప్రస్తుతం దూరంగా ఉంటున్నాడు అని సమాచారం. ఈ క్రమంలోనే వీరు ముగ్గురు విడిపోవడానికి ఒక అమ్మాయి కారణమని అంటున్నారు. ఇటీవల రాంప్రసాద్ కి హెల్త్ బాగా లేనప్పుడు గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్, రాంప్రసాద్ కి ఆర్థికంగా బాగా సహాయపడ్డారు. చాలా డబ్బులు రాంప్రసాద్ కి ఇవ్వడం జరిగింది.

అయితే రాంప్రసాద్ కి ఇచ్చిన డబ్బులు ఒక అమ్మాయి దగ్గర నుండి తీసుకున్నారని. ఇక ఆ అప్పును తిరిగి ఇవ్వాల్సిన సమయంలో గెటప్ శ్రీను మరియు  సుధీర్ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని తెలుస్తోంది. ఇక ఆ గొడవల కారణంగానే వీరు ముగ్గురు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు జబర్దస్త్ లో ఉండే ఒక అమ్మాయి అని తెలుస్తుంది. జబర్దస్త్ లో ఉండే అమ్మాయి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ని డబ్బు కారణంగా విడదీసింది అంటూ అంటున్నారు. ఈ క్రమంలోనే ఏ వార్త తెలిసిన వీరి అభిమానులు మళ్లీ వీరి ముగ్గురు కలిసి స్కిట్లు చేస్తే చూడాలని భావిస్తున్నారు. అంతేకాదు వీరు ముగ్గురు ఎప్పుడు కలిసిమెలిసి ఇలానే ఉండాలి అంటూ కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: