కమల్ హాసన్ కోసం.. క్రేజీ కాన్సెప్ట్ రెడీ చేసిన మణిరత్నం?

praveen
నేటి రోజుల్లో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమా గురించి అందరూ చర్చించుకుంటున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ కూడా తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. తమకు ఇతర భాషల్లో ఉన్న మార్కెట్ ను సైతం పట్టించుకోకుండా ఇలా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఒక భాషకు మించి మరో భాషలో హిట్ అయింది అంటే ఆ సినిమాను పాన్ ఇండియా అనడం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఇలాంటి పాన్ ఇండియా సినిమాలే గతంలో ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అని చెప్పాలి. అలాంటి సినిమాలలో కమలహాసన్ హీరోగా నటించిన నాయకుడు సినిమా కూడా ఒకటి.

 కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో కూడా భారీ విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో మరో సూపర్ హిట్ వస్తుందేమో అని అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూసారు. కానీ మళ్లీ వీరి కాంబినేషన్ రిపీట్ కాలేదు. అయితే కమల్ హాసన్ 234వ చిత్రం లో మాత్రం వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే కమల్ హాసన్ కోసం ఒక క్రేజీ కాన్సెప్ట్ ను అనుకున్నాడట డైరెక్టర్ మణిరత్నం.

 ఈ సినిమాలో  కమలహాసన్ సరసన హీరోయిన్గా త్రిశను తీసుకోవాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. చీకటి రాజ్యం అనే సినిమాలో చివరిగా వీరిద్దరూ కలిసి నటించారు అన్న విషయం తెలిసిందే. అయితే చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతికి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఇక కమల్ హాసన్ సినిమా ఉండబోతుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి. కాగా ప్రస్తుతం మణిరత్నం పొండియన్ సెల్వన్ 2 పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాతే ఇక కమల్ హాసన్ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: