డేంజర్ జోన్ లో కృతి శెట్టి.. అవకాశాలు లేకపోవడంతో సంచలన నిర్ణయం..!?

Anilkumar
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన తొలి సినిమా ఇది. మొదటి సినిమాతోనే ఈ ఇద్దరు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను తమ తమ ఖాతాలో వేసుకొని ఓవర్ నైట్ స్టార్ హీరో హీరోయిన్లుగా మారారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అనంతరం కృతి శెట్టి వరుస సినిమాలలో అవకాశాలు వచ్చాయి.ఈ సినిమా అనంతరం ఆమె నటించిన బంగారు రాజు, శ్యామ్ సింగరాయి వంటి సినిమాలు కూడా మంచి సక్సెస్ను అందుకున్నాయి .దీంతో చాలా తక్కువ సమయంలోనే కృతి శెట్టి స్టార్ హీరోయిన్ లిస్టు లోకి చేరిపోయింది.

 అయితే ఎంత తక్కువ సమయంలో అంతే త్వరగా ఆ క్రీస్ ను పోగొట్టుకుంది కృతి శెట్టి. కెరియర్ మొదట్లో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఈమె దాని నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్ గా మిగిలాయి.ఆ రెండు సినిమాల అనంతరం కృతి శెట్టి నటించిన ది వారియర్ ,మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి  సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయాన్ని అందుకున్నాయి .దీంతో గోల్డెన్ లెగ్ అని పిలిచిన వారే ప్రస్తుతం కృతి శెట్టిని ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ సైతం చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈమెకి ఒక్క సినిమాలో కూడా ఆఫర్లు లేవు.  ఈమె టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునకి జోడిగా కష్టడి అనే ఒక సినిమాలో మాత్రమే నటిస్తుంది.

 వెంకట్ ప్రభు దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నాగచైతన్య కి జోడిగా నటిస్తుంది కృతి శెట్టి. అయితే ఈ క్రమంలోనే కృతి శెట్టి అవకాశాలు రాకపోవడంతో ఒక సంచల నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ లో ఈమెకి అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టాలని భావిస్తోందట కృతి శెట్టి. గతంలో ఈమెకి బాలీవుడ్ నుండి లో ఆఫర్లు రావడం జరిగింది. కానీ టాలీవుడ్ లో ఈమె బిజీగా ఉండడంతో అక్కడి ఆఫర్లను రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఈమె కెరియర్ డేంజర్ లో ఉండడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలో చేయడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు తాజాగా ఒక ప్రాజెక్టుకి కూడా కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: